Jump to content

ఆచార్యత్రయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

[హిందూ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆళ్వారుల వల్ల ప్రభావితులైన విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిచేసిన ముగ్గురు ప్రవర్తకులు. 1. నాథముని/ శ్రీనాథముని, 2. యామునాచార్యుడు, 3. రామానుజాచార్యుడు. శ్రీనాథముని క్రీ॥ శ॥ 824లో జన్మించాడు. ఆళ్వారుల పాశురాలను సేకరించి భద్రపరిచారు. ఇవే నాలాయిరం అనే తమిళ దివ్య ప్రబంధమైనాయి. యామునాచార్యుడు శ్రీనాధముని మనుమడు. ఆయనను అళవందారు అని కూడా అంటారు. సంస్కృత వేదంలోనూ, తమిళ వేదంలోనూ ఆయన గొప్ప పండితుడు. మూడవ వారైన రామానుజాచార్యులు 1017లో జన్మించారు. నాథముని స్థాపించిన వైష్ణవ విశిష్టాద్వైత మఠానికి ఆయన తరువాత యామునాచార్యుడు, తరువాత ఆయన శిష్యుడే అయిన రామానుజాచార్యులు అధిపతులైనారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]