ఆరాటపు పెళ్ళికొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట
స్వరూపం
పెళ్ళి అయిన తరువాత శోభనం ముచ్చట జరుపుతారు. శోభనం కార్యక్రమంలో ముందు పూజ, తరువాత ముత్తయిదువులకు తాంబూలం వంటి ఆచారాలు ఉంటాయి. ఇవి అయినతరువాతనే అమ్మాయిని అబ్బాయిని గది లోకి పంపుతారు. ఈలోపున, పెళ్ళికొడుకుకి ఆత్రం ఎక్కువయి, అంతవరకు ఆగలేక, పేరంటానికి వచ్చిన మహిళల వెంట పడ్డాడట.
ఈ సామెత ఏదయినా పని సాంతము జరిగేవరకు ఆగలేక, ఫలితం కొరకు ఊరికే ఆత్రపడే వారి గురించి గేలి చెయ్యటానికి ఈ సామెతను వాడతారు.