ఏలేశ్వరోపాధ్యాయులు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక సంస్కృతకవి. శ్రీశైలమునకు పశ్చిమభాగమందలి ఏలేశ్వరము అను గ్రామము ఈయన నివాసస్థానము. కనుకనే ఈతనికి ఈపేరు కలిగెను. చిన్నప్పుడే సకలశాస్త్రములు నేర్చి విద్యార్థులకు పాఠములు చెప్ప ఆరంభించినందున ఈయన మొదటిపేరు ఎవరికిని తెలియక పోయెను. మఱియు ఇతఁడు పదునాలుగు సంవత్సరముల ప్రాయమప్పుడే రాజసభలకు పోయి శాస్త్ర ప్రసంగముచేసి ప్రతిపక్ష సిద్ధాంతములను అణఁచి స్వసిద్ధాంతమును స్థాపించెను. గౌతమస్మృతికి దర్పణము అనెడు వ్యాఖ్యానమును, తెనుఁగుదేశమును గుఱించిన భూగోళశాస్త్రము ఒకటియును ఈతనిచే రచియింపఁబడెను.
రానురాను యుగధర్మము వ్యాపించి వర్ణసాంకర్యము కలుగుచు ఉండఁగా ఆంధ్ర బ్రాహ్మణులను నాడులచే విభజించి భోజన ప్రతిభోజనములు తప్ప తక్కిన సంబంధబాంధవ్యములు ఆయాయి నాడువారు వారిలోనే జరుపుకొనుచు ఉండునట్లు నియమించెను. నాటినుండి వెలినాడు, వేగినాడు, ములికినాడు, కాసరనాడు, తెలగాణ్యులు అని ఐదు తరగతులు అయెను. (ఈ వెలినాడు, వేగినాడు మొదలగుపేర్లచే నూఱునాడులు విభాగింపఁబడెను అని ఒక చరిత్రకారుఁడు వ్రాసి ఉన్నాఁడు.) అందు వెలినాటివారు వెలనాటివారు అనియు, ములికినాటివారు మురికినాటివారు అనియు ఇప్పుడు పేర్కొనంబడుచు ఉన్నారు.
కాలక్రమమున కొందఱు బ్రాహ్మణులు వైదిక వ్యాపారములను వదలి లౌకిక వ్యాపారములయందు ప్రవేశించిరి. వారిని నియోగులు అందురు. మొట్టమొదట ఆ నియోగుల సంఖ్య ఆఱువేలు అయినందున వారిని ఆఱువేల నియోగులు అందురు.నియోగులకును వైదికులకును బాంధవ్యము కలుగనేరదు. .................. పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]