స్వాయంభువ మన్వంతరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.
- మనువు - స్వాయంభువు.
- భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి(స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
- మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
- మనుపుత్రికలు -ఆకూతి(రుచి ప్రజాపతి భార్య),ప్రసూతి(దక్ష ప్రజాపతి భార్య),దేవహూతి(కర్ధమ ప్రజాపతి భార్య).
- సప్తర్షులు - మరీచి ప్రముఖులు
- ఇంద్రుడు - రోచనుడు
- సురలు - యామాదులు
- ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.
- స్వాయంభువ మన్వంతరము
- స్వారోచిష మన్వంతరము
- ఉత్తమ మన్వంతరము
- తామస మన్వంతరము
- రైవత మన్వంతరము
- చాక్షుష మన్వంతరము
- వైవస్వత మన్వంతరము (ప్రస్తుత)
- సూర్యసావర్ణి మన్వంతరము
- దక్షసావర్ణి మన్వంతరము
- బ్రహ్మసావర్ణి మన్వంతరము
- ధర్మసావర్ణి మన్వంతరము
- భద్రసావర్ణి మన్వంతరము
- దేవసావర్ణి మన్వంతరము
- ఇంద్రసావర్ణి మన్వంతరము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు.